byసూర్య | Tue, Jun 08, 2021, 12:10 PM
కరోనా పరిస్థితులను కూడా సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాక్సిన్ పేరుతో జూబ్లీహిల్స్లోని ఓ ప్రముఖ బట్టల దుకాణం యజమానిని కేటుగాళ్లు మోసం చేశారు. ఆరోగ్య శాఖ నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు... ఉద్యోగులకు వ్యాక్సిన్ వేస్తామని రూ.1.10 లక్షలు కట్టించుకున్నారు. చివరకు వారి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో యజమాని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు చేపట్టారు.