byసూర్య | Tue, Jun 08, 2021, 11:41 AM
కామ్రెడ్ మధుకర్ అలియాస్ శోబ్రాయ్ను పోలీసులు హత్య చేశారని దక్షిణ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి సమత ఆరోపించారు. అరెస్ట్ చేసి చికిత్స పేరుతో పోలీసులు నాటకాలు ఆడారన్నారు. చికిత్స చేయించకుండా చిత్రహింసలు పెట్టారన్నారు. 15 రోజుల క్రితం కామ్రెడ్ గంగాల్ను కుడా ఇదే తరహాలో హత్య చేశారన్నారు. అగ్రనాయకులకు కోవర్టుల ద్వారా ఆహారంలో విషం పెట్టి అనారోగ్యం పాలు చేశారన్నారు. చికిత్స కోసం బయటకు వచ్చిన మావోయిస్టులను మోసపూరితంగా అరెస్టు చేసి హత్య చేస్తున్నారని సమత ఆరోపించారు.