byసూర్య | Tue, Jun 08, 2021, 10:47 AM
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో దరఖాస్తు గడువును ఈనెల 10వరకు పొడిగిస్తున్నట్లు గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఈసారి ప్రవేశ పరీక్షను రద్దుచేసి పదోతరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దరఖాస్తు చేసేవారు సంస్థ వెబ్సైట్లో పదోతరగతి మార్కులను అప్లోడ్ చేయాలని ప్రవీణ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.