byసూర్య | Mon, Jun 07, 2021, 03:55 PM
మంత్రి కేటీఆర్పై బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా నియంత్రణ చేతకాకనే కేంద్రంపై విషం చిమ్ముతున్నారని, ప్రజల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుకుంటోందని ఆమె ధ్వజమెత్తారు. వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం భారత్ బయోటెక్కు రాష్ట్ర ప్రభుత్వం సహాయనిరాకరణ చేస్తోందని తప్పుబట్టారు. పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని, ట్విట్టర్కు మాత్రమే మంత్రిగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టెస్టుల విషయంలో ప్రభుత్వం అవాస్తవాలు చెప్తోందని ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. భూములు కబ్జా తప్ప టీఆర్ఎస్ ప్రభుయ ప్రజలకు చేసింది శూన్యమని డీకే అరుణ మండిపడ్డారు.