byసూర్య | Mon, Jun 07, 2021, 03:35 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందు చూపు లేకనే ఈ పరిస్థితులు వచ్చాయని..ఈ పరిస్థితికి కారణం ప్రధాని మోదీ ,సీఎం కేసీఆరే అని ఎంపీ కోమిటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శలు గుప్పించారు. గతేడాది అసెంబ్లీలో కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని భట్టి విక్రమార్క అడిగితే ఒప్పుకున్నారని....అయితే 9 నెలలు అవుతున్న ఇప్పటికి అమలు లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడం, నాయకులను కొనడంపైనే కేసీఆర్ దృష్టి ఉందన్నారు. ఎంతోమంది చనిపోతున్నా కేసీఆర్కు పట్టింపులేదన్నారు. కరోనా వైద్యం ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. మనసు లేని మృగంలాగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.