బీజేపీలో చేరికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి క్లారిటీ

byసూర్య | Mon, Jun 07, 2021, 01:01 PM

తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 13న బీజేపీలో చేరనున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కూడా కాషాయ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. దీంతో ఆయన స్పందించారు. కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఏ బీజేపీ నేతను కలవలేదని, అలాంటి లీకులు ఎందుకు ఇస్తున్నారో తెలియదని స్పష్టం చేశారు. రాజకీయంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని గతంలోనే చెప్పాన్న రాజగోపాల్ రెడ్డి…ఇప్పుడు రాజకీయాలు చేసే సమయం కాదన్నారు. కరోనా తో జనం ఇబ్బంది పడుతుంటే… రాజకీయాలేంటి ? అని ఆయన ప్రశ్నించారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM