byసూర్య | Mon, Jun 07, 2021, 12:46 PM
రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన యువతికి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి కోసం వధువు కుటుంబ సభ్యులు శనివారమే వరుడి గ్రామానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం పెళ్లి పీటలపై ఉన్న వధువు తరచూ సెల్ ఫోన్ లో చాటింగ్ చేస్తుండడంతో ఎవరితోనో మాట్లాడడం బంధువులు కొందరు గుర్తించారు. పెళ్లి పందిరిలోనే అనుమానాస్పదంగా కనిపించిన యువకుడిని పట్టుకుని వరుడి తరపు బంధువులు దేహశుద్ధి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తాను, వధువు మూడేళ్లుగా ప్రేమించుకున్నామని ఆ యువకుడు తెలిపాడు. వారిద్దరు కలిసి ఫోన్ లో దిగిన ఫోటోలు చూసి బంధువులు అవాక్కయ్యారు. దీంతో వధువు, యువకుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తాను మూడేళ్లుగా యువకుడిని ప్రేమిస్తున్నానని, పెళ్లి జరిగిన తర్వాత రాత్రికి అతడితో కలిసి వెళ్లిపోవాలని అనుకున్నామని వధువు అంగీకరించింది. అయితే, విచారణ అనంతరం ఎవరూ కేసు పెట్టకపోవడంతో పోలీసులు ఇద్దరినీ వదిలేశారు. ఇరువర్గాల అంగీకారం మేరకు వధూవరులను ఎవరి ఇంటికి వారిని పంపించామని యువకుడిని కూడా వదిలేసినట్లు పోలీసులు చెప్పారు.