byసూర్య | Mon, Jun 07, 2021, 10:33 AM
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కొరత వెంటాడుతోంది. పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు ఆదిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయితే కొన్ని చోట్ల రెండో డోసు కూడా పూర్తి అవుతుండగా తెలంగాణలో తొలి డోసు ప్రస్తుతం పట్టణాలకే పరిమితం అయింది. గ్రామాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోంది అన్న విమర్ళలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు తొలి టీకా కోసం నెల రోజల నుంచి ఎదురు చూస్తున్నారు.