byసూర్య | Sun, Jun 06, 2021, 03:04 PM
వికారాబాద్ జిల్లా బీజాపూర్ హైవేపై రైతులు బైటాయించి ధర్నా చేపట్టారు. తమ వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై అడ్డంగా రాళ్ళు పెట్టి వాహానాల రాకపోకలను రైతులు నిలిపివేశారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. జిల్లా కలెక్టర్ రావాలంటూ, సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.