byసూర్య | Sat, Jun 05, 2021, 03:36 PM
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లే వాహనాలను అడ్డగించి వాహనదారుల నుంచి డబ్బు, ఇతర వస్తువులను దోచుకోనే దారిదోపిడీలకు పాల్పడిన నలుగురు దోపిడీ దొంగలపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి శుక్రవారం పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దారిదోపిడీలకు పాల్పడుతున్న కరీమాబాద్, బీరన్నకుంటకు చెందిన ఎం.డి. ఫిరోజ్, షేక్ రఫీక్, షేక్ గఫూర్, మట్వాడాకు చెందిన కస్తూరి సురేష్ పై వరంగల్ పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీచేశారు. సీపీ ఉత్తర్వులను ఇంతేజా గంజ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు వరంగల్ కేంద్రకారాగారంలో ఉన్న నిందితులకు జైలు అధికారుల సమక్షంలో పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేసారు. పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందుకున్న నిందితులు నలుగురు గత నెల 12వ తేదీన రాత్రి వేళలో వంగపహాడ్-దామెర సమీపాన ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఒక వ్యక్తిని అడ్డగించి పదివేలు ఇవ్వమని డిమాండ్ చేసారు. డబ్బు ఇవ్వకపోవడంతో నిందితులు బాధితుడిని కత్తితో బెదిరించి నాలుగు వేల రూపాయలను దోచుకున్నారు. వీరిని పోలీసులు అరెస్టు చేసిన జైలు తరిలించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు.