byసూర్య | Sat, Jun 05, 2021, 03:00 PM
హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీలో ఐటీ ఉద్యోగుల వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ రెండో రోజు కొనసాగుతోంది. వ్యాక్సిన్ వేయించుకునేందుకు కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు పెద్ద ఎత్తున్న ఈ డ్రైవ్లో పాల్గొంటున్నారు. రోజుకు పది వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఐటీ ఉద్యోగులు కుటుంబ సభ్యులతో పాటు వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. వ్యాక్సిన్ కోసం నిర్వాహకులు పది కౌంటర్లను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ వేయించుకునే ఉద్యోగులు కోవిన్ ఆప్లో రిజిస్ట్రేషన్ చేసుకుని సంస్థ ఐడి కార్డు తప్పనిసరి సరిగా తీసుకురావాలని నిర్వాహకులు స్పష్టం చేశారు.