byసూర్య | Fri, Jun 04, 2021, 04:01 PM
మాజీమంత్రి ఈటల రాజేందర్కు ఆత్మగౌరవం ఉందా? అని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. ఏడేళ్లుగా బానిస బతుకు గుర్తుకురాలేదా అని నిలదీశారు. పదవిపోగానే ఈటలకు ఆత్మగౌరవం గుర్తొచ్చిందా? అని గంగుల కమలాకర్ ప్రశ్నించారు. ఆస్తుల పరిరక్షణ కోసమే ఈటల ఢిల్లీకి వెళ్లాడని, ఈటల ఏం హామీలతో బీజేపీలోకి వెళ్తున్నారన్నారు. ఈటల చెప్పేవన్నీ అబద్దాలే.. కేబినెట్లో ఇవి ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు. వ్యక్తిగత అవసరాలు తప్ప బీసీల కోసం ఏనాడూ మాట్లడలేదని దుయ్యబట్టారు. తప్పులు చేశారు కాబట్టే ఈటలను సీఎం కేసీఆర్ పిలవలేదని గంగుల కమలాకర్ తెలిపారు.