byసూర్య | Fri, Jun 04, 2021, 03:31 PM
మాజీ మంత్రి ఈటల రాజేందర్పై పీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ను టీఆర్ఎస్ కంట్రోల్ చేస్తోందన్న ఈటల వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. ఇన్నాళ్ళు కేసీఆర్ వెంటే ఉన్న ఈటల ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మట్లాడుతున్నాడన్నారు. ఈటల కామెంట్స్ను పూర్తిగా తెలుసుకుని అప్పుడు స్పందిస్తానని ఉత్తమ్ పేర్కొన్నారు.