ఉద్యమ ద్రోహులకే మళ్ళీ పదవులా?: తుల ఉమ

byసూర్య | Fri, Jun 04, 2021, 02:01 PM

ప్రజలతో మమ్మల్ని వేరు చేసే కుట్ర జరుగుతోందని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ పేర్కొన్నారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమకు ఎమ్మెల్యే, మంత్రి అయ్యే అర్హత లేదా? అని ఆమె ప్రశ్నించారు. మేము ప్రజా పోరాటాల్లో ఉన్నవాళ్లమన్నారు. ఉద్యమ ద్రోహులకే మళ్ళీ పదవులా? అని తుల ఉమ ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డికి పదవులు ఎలా ఇస్తారని నిలదీశారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రజలకు దూరంగా జర్మనీలో ఉంటున్నా ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని తుల ఉమ పేర్కొన్నారు.


Latest News
 

సోమగూడెంలో రూ. 90 వేల నగదు పట్టివేత Fri, Mar 29, 2024, 08:37 PM
మానవాళి కోసం ఏసు క్రీస్తు చేసిన త్యాగం Fri, Mar 29, 2024, 08:36 PM
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు Fri, Mar 29, 2024, 08:34 PM
ఆపరేషన్ నిమిత్తమై రక్తం అందజేత Fri, Mar 29, 2024, 08:33 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కౌన్సిలర్లు Fri, Mar 29, 2024, 08:32 PM