ఈటలకు ఎమ్మెల్సీ పల్లా కౌంటర్.. టీఆర్ఎస్ పార్టీలో మీకు దక్కినన్ని పదవులు ఎవరికీ దక్కలేదు

byసూర్య | Fri, Jun 04, 2021, 01:50 PM

బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి చట్ట వ్యతిరేకమైన దేవాదాయ భూములు, అసైన్డ్ భూములను ఎలా కొంటారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. నేడు ఆయన మీడియా సమక్షంలో.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వచ్చే పది రోజుల్లో బీజేపీలో ఈటల కనుమరుగవుతారని వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణ అనేది కచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన పని కాదన్నారు. ఈటల ధాన్యం కొనమంటే సీఎం కేసీఆర్ వద్దన్నారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు పాల్పడుతున్న బీజేపీలో చేరే ముందు ఒకసారి ప్రశ్నించాలని ఈటలకు పల్లా సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందన్నారు. ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి ప్రథకం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిందేనన్నారు. కరోనా రివ్యూలో తాను లేకుండా సీఎం ఒక్కరే చేశారంటూ ఈటల చేసిన ఆరోపణలు అవాస్తవం కాదా అని ప్రశ్నించారు.


నిరంతరం ముఖ్యమంత్రి మానిటరింగ్ చేస్తూ ఈటలకు ఇబ్బంది కాకుండా చూశారని పల్లా తెలిపారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ అధికారులను ఎలా ఇబ్బందులకు గురి చేశారో వారికే తెలుసన్నారు. మీరు మంత్రిగా చేసిన శాఖపై మీకు కనీస అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. కులాల మధ్య కుంపట్లు పెట్టే ఆలోచన మానుకోవాలన్నారు. టీఆర్ఎస్ పార్టీలో మీకు దక్కినన్ని పదవులు ఎవరికీ దక్కలేదని ఈటలను ఉద్దేశించి పల్లా వ్యాఖ్యానించారు.


Latest News
 

కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న 8 కార్లు Wed, Apr 24, 2024, 07:23 PM
పరీక్షల్లో ఫెయిలయ్యానని ఇంటర్ స్టూడెంట్ సూసైడ్.. ఎంత విషాదం Wed, Apr 24, 2024, 07:19 PM
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM