byసూర్య | Fri, Jun 04, 2021, 01:05 PM
జాతీయ జెండాను ఎంతో గౌరవిస్తాం. ఎక్కడ కిందపడకుండా, కాలుతో తొక్కకుండా చాలా గౌరవంగా చూస్తాం. అలాంటి జాతీయ జెండా చెత్త కుప్పలో కనిపించింది. అది కూడా టీఆర్ఎస్ కార్యాలయం పక్కనే కనిపించడం కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్, టీఆర్ఎస్ కార్యాలయానికి కొద్ది దూరంలో జాతీయ జెండాను అవమానించారు. చెత్తకుప్పలో వేశారు. నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పాత హెల్త్ కార్యాలయం వద్ద ఎగురవేసిన జెండా అని స్థానికులు అంటున్నారు. జాతీయ జెండాను అవమానించినవారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.