కరోనా వచ్చిందని భార్యను బాత్రూంలో బంధించిన భర్త

byసూర్య | Fri, Jun 04, 2021, 12:46 PM

ఎవరికైనా కరోనా సోకిందని తెలిసిన వెంటనే ఏం చేస్తారు..? ఆస్పత్రిలోనో లేక ఐసోలేషన్‌లోనో ఉంచి చికిత్స అందిస్తారు. కరోనా బాధితులకు కుటుంబ సభ్యులు ధైర్యం కల్పిస్తూ అండగా ఉంటారు. వైద్యుల సూచన మేరకు కరోనా తగ్గేంత వరకు ఆహారం, మందులు అందిస్తూ సేవలు చేస్తూ ఉంటారు. కానీ కరోనా సోకిన ఓ మహిళ పట్ల తన భర్త అమానుషంగా ప్రవర్తించాడు. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో అమానుషం చోటు చేసుకుంది. కరోనా సోకిన మహిళ పట్ల ఆమె భర్త అమానుషంగా వ్యవహరించాడు. కరోనా సోకిందని బాధితురాలిని బాత్రూంలో బంధించాడు భర్త మేడి పెద్దయ్య. వారం రోజులుగా బాత్రూంలోనే కరోనా బాదితురాలు నరకయాతన అనుభవిస్తుంది. అన్నం నీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు . ఎట్టకేలకు పోలీసులు , వైద్యారోగ్యశాఖ యంత్రాంగం రంగంలోకి దిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి ఇంట్లో ఓ రూంలో ఐసోలేట్ చేయించారు. దాతల సహాయంతో పౌష్టికాహారం ఏర్పాట్లు చేశారు. కరోనా బాధితురాలి పట్ల భర్త అమానుష చర్యపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Latest News
 

సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM
దంచికొడుతున్న ఎండలు..ఆర్టీసీ కీలక నిర్ణయం Tue, Apr 16, 2024, 07:35 PM