సెల్‌ఫోన్ కోసం ప్రాణాలు తీసుకున్న 17ఏళ్ల యువతి

byసూర్య | Fri, Jun 04, 2021, 11:37 AM

వికారాబాద్ లో ఈ ఘోరం చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ కొనివ్వలేదనే కోపంతో ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. వికారాబాద్ జిల్లాలోని దోమ మండలం దిర్సంపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 17ఏళ్ల యువతి... తల్లిదండ్రులు సెల్‌ఫోన్ కొనివ్వడం లేదంటూ మనస్థాపం చెంది ఈగల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన వీరు... దిర్సంపల్లి పౌల్ట్రీ ఫాంలో కూళీలుగా పని చేస్తున్నారు. తండ్రి గులాం పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

మురికి కాల్వలో మగ మృత శిశువు గుర్తింపు Thu, Apr 18, 2024, 03:37 PM
రాంపూర్ గ్రామంలో ముగిసిన అఖండ హరినామ సప్తహ కార్యక్రమం Thu, Apr 18, 2024, 03:34 PM
ఘనంగా పెద్దమ్మ వార్షికోత్సవ ఉత్సవాలు Thu, Apr 18, 2024, 03:32 PM
హస్నాపూర్ గ్రామంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:29 PM
ఇద్దరు బాలికల అదృశ్యం Thu, Apr 18, 2024, 03:27 PM