byసూర్య | Fri, Jun 04, 2021, 09:52 AM
మంత్రి కేటీఆర్ చొరవతో అదనంగా వసూలు చేసిన రూ.4 లక్షల బిల్లు ఆస్పత్రి యాజమాన్యం తిరిగి ఇచ్చేసింది. ఈ ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. చౌటుప్పల్ మండలం తూఫ్రాన్ పేటకు చెందిన చిలుకూరి రవీందర్ రెడ్డి గత నెల 15న కరోనాతో హైదరాబాద్ ఎల్బీనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. రవీందర్కు చికిత్స చేసిన ఆస్పత్రి యాజమాన్యం 15 రోజులకు రూ.7 లక్షలు బిల్లు వేసింది. అనంతరం గాంధీ ఆస్పత్రిలో రవీందర్ మృతి చెందాడు. ఈ వ్యవహారాన్ని చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి... మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మంత్రి స్పందించడంతో దిగి వచ్చిన ఆస్పత్రి యాజమాన్యం మృతుడి సోదరుడి ఖాతాలో డబ్బును జమ చేసింది.