byసూర్య | Mon, Apr 12, 2021, 04:23 PM
వనపర్తి: తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికి కరోనా సోకింది. రెండ్రోజులుగా స్వల్ప అస్వస్థతతో ఉండటంతో ఆయనకు ఇవాళ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మంత్రి తెలిపారు. గత రెండు, మూడు రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని.. హోం క్వారంటైన్ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తాను వనపర్తిలో హోం క్వారంటైన్లో ఉన్నట్లు మంత్రి తెలిపారు.