byసూర్య | Mon, Apr 12, 2021, 03:58 PM
నగర మేయర్ విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలోని బీజేపీ కార్పొరేటర్లు తనతో టచ్లో ఉన్నారని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. వారు గెలిచిన డివిజన్ల అభివృద్ధికి తాను కృషి చేస్తానని మేయర్ పేర్కొన్నారు. ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో కౌన్సిల్ సమావేశం ఉంటుందని విజయలక్ష్మి తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకోవాల్సిందేనని మేయర్ విజయలక్ష్మి పేర్కొన్నారు.