byసూర్య | Mon, Apr 12, 2021, 03:02 PM
హైదరాబాద్: ఇందిరా పార్క్ వద్ద నిర్వహించ తలపెట్టిన భరోసా దీక్షకు అనుమతిని కోరుతూ సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వ ప్రసాద్ను షర్మిల టీం కలిసింది. అనుమతిపై మంగళవారం సాయంత్రం లోపు నిర్ణయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈనెల 15ను 72 గంటలపాటు భరోసా దీక్ష చేస్తానని ఖమ్మం సభలో షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, దీక్షకు అఖిలపక్షం నేతలను షర్మిల ఆహ్వానించారు. ప్రజాగాయకుడు గద్దర్, టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం, బీసీ సంఘాల జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తదితరులకు ఆహ్వానమందింది.