జగిత్యాల జిల్లాలో గొర్రెల పంపిణీలో గోల్ మాల్

byసూర్య | Mon, Apr 12, 2021, 02:27 PM

జగిత్యాల: జిల్లాలో గొర్రెల పంపిణీలో గోల్ మాల్ జరిగింది. గొర్రెలకు బదులు డబ్బులు ఇస్తామని బ్రోకర్లు అంటున్నారు. అధికారులతో కుమ్మక్కయి.. కింది నుంచి పై వరకు లంచాలు ఇస్తామని వ్యాపారులు చెబుతున్నారు. లబ్దిదారులతో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ఒక్క యూనిట్ ధర లక్షా ఇరవై ఐదు వేలు. లబ్దిదారులు రూ. 31,250 కడితే మిగతా మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే లబ్దిదారులకు రూ. 70 వేలు మాత్రమే ఇస్తామని వ్యాపారులు చెబుతున్నారు. ఒకే యూనిట్ గొర్రెలతో పదిమందికి పంపిణీ చేస్తున్నారు. ఫోటో దిగి అదే యూనిట్ మరొకరికి ఇస్తున్నట్లు వ్యాపారులు చూపెడుతున్నారు. వారి సెల్ ఫోన్ సంభాషణ ఏబీఎన్ చేతికి చిక్కింది.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM