byసూర్య | Mon, Apr 12, 2021, 01:00 PM
తెలంగాణలో మాస్కులు ధరించని వారిపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మాస్క్ ధరించని సుమారు 6,500 మందిపై కేసులు నమోదు చేశారు. అత్యధికంగా హైదరాబాద్ లో మాస్కు ధరించని 2,000 మందిపై కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్, సైబారాబాద్, రాచకొండలో మాస్క్లు ధరించని 3,500 మందిపై కేసులు నమోదయ్యాయి. మాస్క్ ధరించని వారిని ఆపి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద రూ.1000 జరిమానా వేస్తూ కోర్టులో హాజరు కావాలని పోలీసులు చెబుతున్నారు.