కేసీఆర్‌కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ

byసూర్య | Mon, Apr 12, 2021, 11:31 AM

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ ఏజ్ లిమిట్ 34 నుంచి 44 ఏళ్ళకు పెంచాలన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు సోషల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పనకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలన్నారు. నిరుద్యోగ భృతి వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. ఐటీఐఆర్ గేమింగ్ అండ్ యానిమేషన్ ఇండస్ట్రీని స్థాపించాలన్నారు. వ్యవసాయ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఒక్కో ప్రాంత నిర్ధిస్ట ప్రతిభకు సంబంధించిన పరిశ్రమలను అభివృద్ధి చేయాలన్నారు. అలాగే పెద్ద, మైక్రో అండ్ స్మాల్ మీడియం మ్యానుఫాక్యరింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయించాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు హై లెవల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ను వివిధ రంగాలకు చెందిన మేధావులు, పారిశ్రామిక రంగాల వారితో ఏర్పాటు చేయాలని కోరారు. బీసీ, ఎసీ, ఎస్టీ మైనార్జీలకు ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా స్వయం ఉపాధి, సొంత వ్యాపారాలను పెంపొందించేందుకు లోన్స్ విడుదల చేయాలన్నారు. ఉద్యోగ నియామకాలు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM