byసూర్య | Mon, Apr 12, 2021, 11:01 AM
అత్తవారి ఇంట్లో వేధింపులు తట్టుకోలేక మనస్తాపంతో మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చౌటుప్పల్ మండలం పరిధిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా పికిలిపురం గ్రామానికి చెందిన జ్యోతి మండలంలోని తంగడపల్లికి చెందిన సుందర్ తో వివాహమైంది. వారికీ అప్పటికి ఏడాదిన్నర బాబు ఉండగా, 12 రోజుల కిందట డెలివరీ అయిన జ్యోతి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవల అత్తవారి వేధింపులు మొదలవ్వడంతో పాటు తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో మనస్తాపానికి గురై ఎంఎం స్టేడియం సమీపంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు ఎస్సై నవీన్ బాబు కేసు నమోదు చేసుకొని దర్యాఫు చేస్తున్నారు.