byసూర్య | Mon, Apr 12, 2021, 10:29 AM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2,251 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. రాష్ట్రంలో నిన్న 79,027 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,29,529కి చేరింది. మరోవైపు కరోనాతో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 1765 కి చేరింది. తాజాగా కరోనా నుంచి 565 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,05,900కి చేరింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 355 కేసులు నమోదయ్యాయి.