byసూర్య | Mon, Apr 12, 2021, 09:03 AM
కరోనా మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మాస్కులు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే చోట, రవాణా స్టేషన్స్ వద్ద తప్పనిసరి మాస్కులు వినియోగించాలని కోరారు. మాస్కులు ధరించనిచో సెక్షన్ 188 కింద శిక్షార్హులని పేర్కొంది. అలాగే, రూ.1, 000 జరిమానా విధిస్తామని, జీవోను కచ్చితంగా అమలు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, జడ్జిలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు చట్టాన్ని అమలు చేయాలంటూ ఆదేశించారు.