byసూర్య | Mon, Apr 12, 2021, 08:45 AM
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో ప్రజలు వ్యాక్సిన్ కోసం సెంటర్లకు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ డోసులు నిండుకుంటున్నాయని వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వం కేంద్రానికి లేఖను కూడా రాసింది. కాగా నిన్న మొన్నటి వరకు వ్యాక్సిన్ వేసుకోండని అధికారులు సూచిస్తే లైట్ తీసుకున్న వారే ఇవాళ వ్యాక్సిన్ కోసం లైన్లలో నిల్చుంటున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా బారిన పడకుండా అడ్డుకోకపోయినా ప్రాణాపాయ స్థితి నుండి గట్టేకిస్తుందని పలువురు ఇప్పటికే చెబుతున్నారు.