byసూర్య | Mon, Apr 12, 2021, 08:24 AM
కరోనా వ్యాక్సిన్ విషయంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులంతా ఈ నెల 15లోపు వ్యాక్సిన్ వేయించుకోవాలని, వ్యాక్సిన్ తీసుకుంటేనే కార్యాలయాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ అధికారులు 30 వేల మంది సిబ్బందికి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.