byసూర్య | Mon, Apr 12, 2021, 07:45 AM
జీహెచ్ఎంసీ అనుసరిస్తున్న టీడీఆర్ (అభివృద్ధి బదలాయింపు హక్కు) ఒక మంచి ప్రయత్నమని కేటీఆర్ కొనియాడారు. దీని వల్ల బల్దియాకు రూ. 1500 కోట్ల నగదు మిగులుబాటయ్యేలా వెసులుబాటు కలిగిందన్నారు. టీడీఆర్ కింద ఇప్పటి వరకు రూ.3,095.50 కోట్లు వెచ్చించారని కేటీఆర్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ ద్వారా ఇప్పటి వరకు రోడ్ల విస్తరణలో చేపట్టిన ఎస్సార్డీపీ, లింక్ రోడ్ల నిర్మాణం, రహదారుల విస్తరణ, చెరువుల సుందరీకరణ, నాలా విస్తరణలకు మొత్తం 807 టీడీఆర్లు జారీ చేశారు.