byసూర్య | Sat, Apr 10, 2021, 10:58 AM
తెలంగాణలోని వ్యవసాయ, పశుసంవర్థక యూనివర్సిటీల పరిధిలో చేపట్టే నియామకాలకు ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లు (ఈడబ్ల్యూఎస్) అమలవుతాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలు నేపథ్యంలో మార్చి 31న జారీ చేసిన నోటిఫికేషన్కు తాజాగా టీఎస్పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ను జారీ చేసింది. రెండు విశ్వవిద్యాలయాల్లో కలిపి 127 సీనియర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లోని పోస్టులకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేస్తూ రోస్టర్ పాయింట్లను సైతం ఖరారు చేసింది. ఈ పోస్టులకు ఈనెల 19 నుంచి మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది. నిరుద్యోగులు ఈ విషయాలను గమనించి దరఖాస్తు చేసుకోవాలిన సూచించింది.