తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్

byసూర్య | Sat, Apr 10, 2021, 10:58 AM

తెలంగాణలోని వ్యవసాయ, పశుసంవర్థక యూనివర్సిటీల పరిధిలో చేపట్టే నియామకాలకు ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లు (ఈడబ్ల్యూఎస్‌) అమలవుతాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు నేపథ్యంలో మార్చి 31న జారీ చేసిన నోటిఫికేషన్‌కు తాజాగా టీఎస్‌పీఎస్‌సీ అనుబంధ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రెండు విశ్వవిద్యాలయాల్లో కలిపి 127 సీనియర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌లోని పోస్టులకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేస్తూ రోస్టర్ పాయింట్లను సైతం ఖరారు చేసింది. ఈ పోస్టులకు ఈనెల 19 నుంచి మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. నిరుద్యోగులు ఈ విషయాలను గమనించి దరఖాస్తు చేసుకోవాలిన సూచించింది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM