తెలంగాణలో కొత్తగా 2,909 పాజిటివ్‌ కేసులు

byసూర్య | Sat, Apr 10, 2021, 10:34 AM

తెలంగాణలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైద్యారోగ్య శాఖ తాజా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,909 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ తో నిన్న ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,24,091కి చేరగా మృతుల సంఖ్య 1752కు చేరుకుంది. ప్రస్తుతం 17,791 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 11,495 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలో వైరస్ బారిన పడ్డవారిలో ఇప్పటి వరకు 3,04,548 మంది కోలుకున్నారు. సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్ర రూపంలో ఉండటంతో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM