byసూర్య | Sat, Apr 10, 2021, 08:18 AM
ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి ఆర్థిక సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. Schooledu.telangana.gov.in అనే వెబ్ సైట్ లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ సిబ్బంది బ్యాంకు, ఆధార్ వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అప్ లోడ్ చేసిన వివరాలను ఎంఈవో, డీఈఓలు, అధికారులతో తనిఖీ చేసి సాయం అందించేలా మార్గదర్శకాలు విడుదల చేశారు.
ముఖ్యమైన తేదీలు:
వివరాల సేకరణ ఏప్రిల్ 15 నుండి
క్రోడీకరణ, తనిఖీ ఏప్రిల్ 16 నుండి 19 వరకు
నగదు జమ ఏప్రిల్ 20 నుండి 24 వరకు
బియ్యం పంపిణీ ఏప్రిల్ 21 నుంచి 25 వరకు