తెలంగాణలో కరోనా టెన్షన్.. ఆ గ్రామాల్లో లాక్ డౌన్...!

byసూర్య | Sat, Apr 10, 2021, 08:05 AM

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామాలు స్వచ్చంధంగా లాక్ డౌన్ విధించుకుంటున్నాయి. తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దు, నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బోధన్ నియోజకవర్గంలో 3 మండలాల్లో లాక్ డౌన్ విధించారు. బోధన్ మండలం సాలూర క్యాంపు, రెంజల్ మండలం తాడి బిలోలి, నవీపేట్ మండలం బినోల గ్రామాల్లో 15 రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించారు. ఆయా గ్రామాల్లో సుమారు 30 మందికి పైగా కరోనా బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార సంస్థలు మూసివేశారు. తమ గ్రామంలోకి ఎవరూ రావద్దని సూచిస్తున్నారు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM