byసూర్య | Sat, Apr 10, 2021, 07:45 AM
ఖమ్మంలో వైఎస్ షర్మిల శుక్రవారం సంకల్ప సభ నిర్వహించారు. తెలంగాణలో తాను పెట్టబోయే పార్టీ పేరు జూలై 8న ప్రకటిస్తానని తెలిపారు. వైఎస్ఆర్ జన్మదినం సందర్భంగా కొత్త పార్టీ పేరు ప్రకటిస్తామని షర్మిల తెలిపారు. ఖమ్మంలో జరిగిన సభలో కొత్త పార్టీ కార్యాచరణను షర్మిల ప్రకటించారు. ఈ నెల 15 నుంచి నిరుద్యోగులకు మద్దతుగా నిరాహార దీక్షలు చేపడతామన్నారు.