byసూర్య | Fri, Apr 09, 2021, 05:28 PM
వైఎస్ షర్మిల కాన్వాయ్ మరి కాసేపట్లో ఖమ్మం చేరుకోబోతుంది. ఖమ్మంలో షర్మిలకు ఘన స్వాగతం పలికే భారీ ఏర్పాట్లు చేశారు. ఖమ్మం పట్టణానికి సమీపంలోని పెద్దతండా వద్ద వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించి.. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో వీరంతా పెవిలియన్ గ్రౌండ్స్కు చేరుకుంటారు. లక్ష మందితో సంకల్ప సభను నిర్వహించాలని షర్మిల భావించినా కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 6 వేల మందితో నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. అయితే, అభిమానుల ఉత్సాహం చూస్తుంటే సంకల్ప సభకు భారీగానే హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయని షర్మిల పార్టీ నేత ఒకరు తెలిపారు. సభలో షర్మిల ఏం మాట్లాడుతారా..? అని అభిమానులు, అనుచరులు, పార్టీ నేతల్లో సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.