byసూర్య | Fri, Apr 09, 2021, 04:33 PM
మనస్థాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భూత్పూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై భాస్కర్ రెడ్డి వివరాల ప్రకారం మండలంలోని మద్దిగట్ల గ్రామానికి చెందిన చేగుంట గంగాపురి(35) మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన వెంకట్రాములు కుమారుడు గంగాపురి వరి కోత మిషన్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. అయితే గ్రామానికి చెందిన ఓ యువతిని వేదిస్తున్నాడంటూ ఆరోపణలు రావడంతో గంగాపురి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.