byసూర్య | Fri, Apr 09, 2021, 03:55 PM
దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్ కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన.. కొవిడ్ వ్యాక్సిన్, చికిత్సా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని అన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.