పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

byసూర్య | Fri, Apr 09, 2021, 01:23 PM

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పేరుపల్లి గ్రామపంచాయతీలో శుక్రవారం మధ్యాహ్నం ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పేరుపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా రాములు(39) రెండున్నర ఎకరాలు మిర్చి పంట సాగు చేశాడు. అయితే పంట పెట్టుబడికి అప్పులు చేయగా పంట దిగుబడి సరిగా రాకపోవడంతో పాటు ఎండిపోవడంతో మనస్థాపానికి గురైన రాములు పంట చేనువద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య పద్మతో పాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సంఘటన స్థలానికి స్థానిక సర్పంచ్ అజ్మీర నాగేశ్వరం చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. కారేపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలను సేకరించి పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఇల్లందు ఆసుపత్రికి తరలించారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM