byసూర్య | Fri, Apr 09, 2021, 01:06 PM
హైదరాబాద్లోని లంగర్ హౌజ్ వద్ద శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకువచ్చి వందవ పిల్లర్ నెంబర్ వద్ద డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకునికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గాయాలైన యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మితిమీరిన వేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, మద్యం మత్తులో కారు నడుపుతున్నట్లు వెల్లడించారు.