భగ్గుమంటున్న అడవులు

byసూర్య | Wed, Apr 07, 2021, 05:22 PM

ఉష్టోగ్రతలు అత్యధికంగా నమోదు కావడంతో అడువులు పలు చోట్ల ఎరగడి పడుతున్నాయి. దుమ్ముగూడెం అటవీ రేంజి పరిధిలోని పర్ణశాల సెక్షన్‌లో గల పెద్దబండిరేవు, ములకనాపల్లి, పులిగుండాల అటవీ ప్రాంతాల్లో పలు చోట్ల చెట్ల నుండి రాలిన ఆకులకు మంటలు అంటుకుని పెద్ద మంటలతో అడవులలో మంటలు చెలరేగుతూ పొగలు కమ్ముతున్నాయి. అటవీ సిబ్బంది ఎండాకాలంలో అడవులను సంరక్షించేందుకు ఫైర్‌ లైన్స్‌ ఏర్పాటు చేసినపప్పటికి గుట్ట దట్టంగా ఉన్న అటవీ ప్రదేశంలో అడవులకు నిప్పంటుకుని మంటలు చెలరేగుతున్నాయి. ఈ విషయమై పర్ణశాల ఫారెస్టు బీట్‌ ఆఫీసరు శ్రీనును వివరణ కోరగా ఎండాకాలంలో అడవులను మంటల నుండి రక్షించేందుకు ముందస్తుగా ఫైర్‌ లైన్లు ఏర్పాటు చేశామని గుట్ట వంటి అటవీ ప్రాంతంలోనే అక్కడక్కడా అడవి ఎరగడి పడుతుందన్నారు. దీని వలన అటవీ మొక్కలకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన తెలిపారు.


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM