byసూర్య | Wed, Apr 07, 2021, 04:13 PM
కొత్తగూడెంలో కలకలం రేపిన చెల్లిలిపై అన్నలు అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఓ నిందితుడు ఆత్మహత్యకు పాల్పడాడు. యువతిపై ఆమె అన్నతో పాటు, పెద్దమ్మ కుమారుడు అజయ్ కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారు. కొత్తగూడెం టూటౌన్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుతో భయాందోళనకు గురైన అజయ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా రామవరంలో చోటుచేసుకుంది.