byసూర్య | Wed, Apr 07, 2021, 03:31 PM
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కెంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయుడికి , యాస్మిన్ గండ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే వీరితో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారు మంగళవారం హుటాహుటిన ప్రైమరీ హెల్త్ సెంటర్ కి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. అయితే అందరికీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని మండల వైద్య అధికారులు డాక్టర్ నవీన్ రెడ్డి తెలిపారు.