byసూర్య | Wed, Apr 07, 2021, 03:12 PM
కూకట్ పల్లి లో మాక్స్ హెల్త్ హాస్పిటల్ ను మంత్రి హరీష్ రావు, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడుతూ...కరోనా ఎక్కువ అవుతున్న తరుణంలో అందరూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. తప్పకుండా అందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు.