byసూర్య | Wed, Apr 07, 2021, 02:04 PM
కడుపునొప్పి భరించలేక ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పాపన్నపేట మండల పరిధిలోని నాగ్సాన్ పల్లికి చెందిన వినోద (22) స్థానిక రాంనగర్లో అద్దెకు ఉంటున్నది. కొంతకాలంగా ఆమె కడుపునొప్పితో బాధపడుతున్నది. మంగళవారం ఉదయం కూడా కడుపునొప్పి రావడంతో భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. తండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్త, పదినెలల పాప ఉన్నది.