భర్తకు షాకిచ్చిన భార్య.. వేరే వ్యక్తితో పరార్...!

byసూర్య | Wed, Apr 07, 2021, 01:55 PM

రాజస్థాన్ జోధ్‌‌పూర్‌ బారీ ఖోకూండ గ్రామానికి చెందిన ప్రభుదాస్‌, తన భార్య రమ్య, రెండేళ్ల కుమారుడు ప్రకాశ్‌ లతో కలిసి ఈనెల 3న హైదరాబాద్ లో ఉంటున్న త‌మ‌ అమ్మమ్మ ఇంటికి వచ్చారు. అమ్మమ్మను పలకరించి ఇక వారి ఊరు వెళ్దామ‌ని ఈనెల 4న కుటుంబ సమేతంగా ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న రమ్య వాటర్ బాటిల్‌ తెచ్చుకుంటానని చెప్పి రెండేళ్ల కుమారుడు ప్రకాశ్ తో‌ రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న‌ రోడ్డు వైపుకు వెళ్లింది. ఈలోగా రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఓ ఆజ్ణాత వ్యక్తి బైకుతో ఉండగా రమ్య తన కుమారుడితో వెళ్లి ఆ బైకుపై ఎక్కి వెళ్లిపోయింది. చాలాసేపటికి తన భార్య రాకపోవడంతో అనుమానం వచ్చి రైల్వే స్టేషన్‌ ముందు ప్రభుదాస్ వాకబు చేశాడు. ఓ మహిళ బైకుపై వెళ్లిపోయిందని అక్కడ ఉన్న వారు చెప్పారు. వెంటనే భర్త ప్రభుదాస్‌ గోపాలపురం పోలీసులను ఆశ్రయించాడు. అప్రమత్తమైన పోలీసులు సీసీ పుటేజీను పరిశీలించారు. ఓ ఆజ్ణాత వ్యక్తి బైకుపై వెళుతున్నట్లు సిసి పుటేజీలో కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరూ..? ఆమెను ఎందుకు బైక్ పై తీసుకువెళ్ళాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM