byసూర్య | Wed, Apr 07, 2021, 01:41 PM
కొవిడ్ కారణంగా వారు ఆర్థికంగా చితికిపోయారని, ఇళ్ల అద్దెలు, విద్యుత్తు బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. విద్యానగర్లోని బీసీ భవన్లో మంగళవారం చేతి, కుల వృత్తిదారుల సమావేశం జరిగింది. చేతి, కుల వృత్తిదారులందరికి ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కృష్ణ, వెంకటేష్, అంజి, సతీష్, చంద్రశేఖర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.