byసూర్య | Wed, Apr 07, 2021, 01:28 PM
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ళ గ్రామ శివారులో కల్వర్టును ఇసుక లారీ ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ పేరు మిథిలేష్ గా బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు ప్రమాదానికి గల కారణం అని తెలుస్తోంది.