byసూర్య | Wed, Apr 07, 2021, 12:02 PM
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. శంషాబాద్ మండలం తొండుపల్లిలో కన్నతండ్రే తన ఆరు నెలల కొడుకును చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. తొండుపల్లికి చెందిన విక్రమ్, స్పందన దంపతులకుపెళ్లైన ఆరేళ్ల ఓ బాబు పుట్టాడు. మద్యానికి బానిసైన విక్రమ్.. మద్యంమత్తులో రోజూ ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇంట్లో గొడవ చేశాడు. ఆవేశంతో 6 నెలల పసికందును నీటిసంపులో పడేసి మూతపెట్టాడు. దీంతో ఆ చిన్నారి మరణించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.