దారుణం.. కన్నతండ్రే చంపేశాడు

byసూర్య | Wed, Apr 07, 2021, 12:02 PM

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. శంషాబాద్ మండలం తొండుపల్లిలో కన్నతండ్రే తన ఆరు నెలల కొడుకును చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. తొండుపల్లికి చెందిన విక్రమ్‌, స్పందన దంపతులకుపెళ్లైన ఆరేళ్ల ఓ బాబు పుట్టాడు. మద్యానికి బానిసైన విక్రమ్‌.. మద్యంమత్తులో రోజూ ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇంట్లో గొడవ చేశాడు. ఆవేశంతో 6 నెలల పసికందును నీటిసంపులో పడేసి మూతపెట్టాడు. దీంతో ఆ చిన్నారి మరణించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM
యూపీ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ.. బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీ Thu, Apr 18, 2024, 08:58 PM